AMARAVATHI

నగర వ్యాప్తంగా వున్న ప్రతీ భవనాన్ని పన్ను పరిధిలోకి తీసుకుని రండీ-కమిషనర్ వికాస్ మర్మత్

పన్నుల బకాయిల వసూళ్లను..
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి పన్ను, కమర్షియల్ భవనాల పన్నులు, మంచినీటి పన్నులు, డ్రైనేజీ పన్నుల వసూళ్ళు నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, లక్ష్యాలను సాధించాలని కమిషనర్ వికాస్ మర్మత్, సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు.నగర పాలక సంస్థ అధికారులు, సచివాలయ అడ్మిన్ లతో బుధవారం సమీక్ష సమావేశాన్ని కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలలో తక్కువ శాతం వసూళ్లు చేసిన కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అమెనిటీస్ కార్యదర్శులు మంచినీటి పన్నులను వసూళ్ల లక్ష్యాలను అందుకోవాలని, అపార్టుమెంట్లు, సినిమా హాళ్లు తదితర వాణిజ్య భవనాలకు సంభందించిన పన్నుల వసూళ్ళ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మొండి బకాయిదారులను గుర్తించి మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్ను వసూళ్లు కోసం త్వరలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో వసూళ్ల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు. నగర వ్యాప్తంగా ప్రతీ భవనాన్ని పన్ను పరిధిలోకి తీసుకొచ్చి, డిమాండ్ నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. పన్ను వసూళ్ళలో సచివాలయ అడ్మిన్ కార్యదర్శులకు రోజూవారి లక్ష్యాలను నిర్దేశించి కార్పొరేషన్ ఆదాయం పెంచేందుకు అధికారులంతా కృషి చేయాలని కమిషనర్ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ శర్మద, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ ఎస్.ఈ సంపత్ కుమార్, రెవెన్యూ, ఇంజనీరింగు అధికారులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

9 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

11 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

15 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

15 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

19 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.