AMARAVATHI

వైసీపీకి వేమిరెడ్డి రాజీనామా ? ఆత్తారింటికి దారి ఏది ? బీజెపీ ! టీడీపీ !

జిల్లా రాజకీయాల్లో వైసీపికి భారీ కుదుపు…  

నెల్లూరు: జిల్లా రాజకీయాల్లో వైసీపీని భారీ కుదుపు ఎం.పి వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి రూపంలో బుదవారం తాకింది..వేమిరెడ్డి గత రెండు నెలల నుంచే వైసీపీని వీడేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన,, అవి అన్ని పూకార్లే అంటూ వేమిరెడ్డి వర్గీయులు కొట్టి పారేశారు..2019 ఎన్నికల నుంచి జిల్లాలో వైసీపీకి అన్ని తానై బాధ్యతలు తీసుకుని భరిస్తు వచ్చానని అనూయుల దగ్గర వాపోయినట్లు తెలిసింది..2024 జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మూడు మార్పులు చేయాలని,, తాను సమర్దించే వారికి టిక్కెట్లు ఇవ్వలని అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలియ వచ్చింది.. ఇందులో నెల్లూరుసీటి టిక్కెట్ ను ప్రస్తుతం వున్న ఎమ్మేల్యే ఇవ్వకూడదు..? వేమిరెడ్డి.ప్రశాంతికి నెల్లూరుసీటి టిక్కెటు,,కావలిలో విష్టువర్దన్ రెడ్డి పేరును సూచన ప్రాయంగా వైసీపీ సలహాదారుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం ? అయితే ఇందుకు వైసీపీ అధిష్టానం వేమిరెడ్డి డిమాండ్లను పూర్తి స్థాయిలో అంగీకరించలేదనేది కళ్ల ముందు కన్పిస్తున్న నిజం? దింతో వేమిరిడ్డి వర్గీయులు మీడియాకు లీకులు అందించి,,అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు..ఇందుకు అనుగుణంగానే మూడు వారాల క్రిందట వేమిరెడ్డి,జిల్లాలోని జిల్లా స్థాయి జర్నలిస్టులను వ్యక్తిగత మీడియా సమావేశం అంటూ ఉదయం పూట ఇంటికి పిలిపించి వారితో “ఇష్టా గొష్టి” (కొన్ని విషయాలు ప్రస్తావించలేను) మాట్లాడి, ఎలాంటి సంచలన విషయంను ప్రకటించ కుండానే మీడియా సమావేశం ముంగించేశారు..ఇలాంటి గిమ్మికులు చాలా చూసిన వైసీపీ అధిష్టానం,,వేమిరెడ్డి పట్ల కాస్త కఠినంగానే వ్యవహరించడం ప్రారంభించింది..దింతో తాను అనుకున్నది ఒకటి అయినది ఒకటి కావడంతో,వెంటనే రూటు మార్చిన వేమిరెడ్డి,టీడీపీ,బీజెపీ నాయకులతో రహస్య సంప్రదింపులకు తెర తీశారు..అటు వైపు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో,,షాసబిషాలు వదిలి వేసి,,నేడు తన వ్యక్తిగత కారణలతో వైసీపీ ప్రాథమిక సభ్యత్వనికి,,ఎం.పి పదవీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు..రాజీనామ లెటర్ ను మీడియాకు విడుదల చేశారు..ఈ సందర్బంలో రాజీనామ చేసేందుకు ఇంకా వేరే కారణాలు ఏమైన వున్నాయా ? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే,,ఇందుకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుని వెళ్లి పోయారు..వేమిరెడ్డి తన రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీ-జనసేన పంచన చేరుతారా ? లేక దీర్ఘకాలం ప్రయోజనలు దృష్టిలో వుంచుకుని బీజెపీ వైసు అడుగులు వేస్తారా లేక రాజకీయ పరమైన ఒత్తిడిలను తప్పించుకుని,,తను పోటీలో నిలవ కుండా తన సతీమణిని రంగంలో దింపుతారా ? అనేది వేచి చూడాలి ?

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

11 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

11 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

17 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

1 day ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

2 days ago

This website uses cookies.