AGRICULTURE

రబీ సీజన్ లో ఎరువులపై సబ్సిడీని ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం

అమరావతి: రైతులపై ఎరువుల భారం పడకుండా 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు రబీ సీజన్ లో ఎరువుల పై రాయితీని కేంద్రమంత్రిమండలి ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్రమంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదించడంతో, రబీ సీజన్ లో దాదాపు రూ.51,875 కోట్ల రూపాయల రాయితీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నత్రజని (N), భాస్వరం (P), పొటాష్ (K), సల్ఫర్ (S) వంటి ఎరువులపై పోషకాల ఆధారిత సబ్సిడీ (NBS) కోసం కేంద్ర ఎరువుల శాఖ ప్రతిపాదనకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది.వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడంలో భాగంగా కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది రైతులు లబ్ధి పొందనున్నారు.2022-2023 రబీ సీజన్ కు గానూ అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన ఎరువుల దుకాణాల వద్ద రాయితీతో కూడిన ఎరువులు లభించనున్నాయి. రష్యా,ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా,ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.అయితే ప్రధాని మోదీ,భారత్ కు ఎరువుల సరఫరా పెంచాలని చేసిన విజ్ఞప్తికి, రష్యా అధ్యక్షడు పుతిన్ సానూకూలంగా స్పందించడంతో,భారతదేశంలోని రైతులకు సరిపడినంత ఎరువులను కేంద్రం అందిచనున్నది.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

37 mins ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

1 hour ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

1 hour ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

21 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

1 day ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

1 day ago

This website uses cookies.