AMARAVATHI

సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు-వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డి


తిరుపతి: మహిళలకు సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా అదునిక సౌకర్యాల వున్న రూ.3 కోట్లు విలువ చేసే మొబైల్ బస్సులో నిర్వహిస్తారని, ఈ ఆవకాశంను ప్రజలు ఉపయోగించుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి.ప్రశాంతి కోరారు..ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ డే 2024 సందర్బంగా ఆదివారం శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆవరణలో రెండు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే బస్ లను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు..ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ స్విమ్స్ శ్రీపద్మావతి మహిళా మెడికల్ కాలేజీకి రెండు అత్యాధునిక పరికరాలు గల మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ బస్సులను దాతలు విరాళంగా ఇచ్చిన వాటిని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.. ప్రజలు ఈ వాహనాలు వారి గ్రామాలకు వచ్చినప్పుడు క్యాన్సర్ అనుమానితులు పరీక్షలు చేయించుకోవాలని కోరారు..రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ సహకారంతో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..ఈ వాహనంలో సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారని, ఊపిరితిత్తులకు, ఇతర సంబంధ క్యాన్సర్ అనుమానితులను స్విమ్స్ హాస్పిటల్ కు రెఫెర్ చేయబడుతుంది అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆం.ప్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, ఎంపీ మద్దిల గురుమూర్తి, జేఈఓ సదాభార్గవి, టీటీడీ పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి, స్విమ్స్ డైరెక్టర్ మరియు వి.సి ఆర్ వి కుమార్, స్పెషల్ ఆఫీసర్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజి జయచంద్రారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

1 hour ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

16 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

22 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

2 days ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

2 days ago

This website uses cookies.