నెల్లూరు: మత్స్య, ఆక్వా సాగు రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జాతీయస్థాయిలో జిల్లాకు లభించిన ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు అందుకున్నారు. సోమవారం డామన్ లోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ కార్యదర్శి జితేంద్రనాథ్ స్విన్ చేతుల మీదుగా ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని కలెక్టర్ అందుకున్నారు. ఈ పురస్కారం కింద మూడు లక్షల రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేసి జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర బాబును ఘనంగా సత్కరించారు. 2021-22 సంవత్సరానికి గాను మత్స్య సంపద ఉత్పత్తి, వ్యవస్థీకృత సమగ్ర అభివృద్ధి, రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల పునరుత్పత్తి, ఆక్వా, మెరైన్ కల్చర్లలో సమగ్ర ఆధునిక పద్ధతుల్లో రొయ్యలు, చేపల సాగు, ఫిష్ లాండరింగ్, డ్రెస్సింగ్ సెంటర్ల నిర్మాణము, మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణము మొదలైన అంశాలలో దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జిల్లాకు ఈ అరుదైన పురస్కారం లభించింది.కలెక్టర్ వెంట మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్ ఉన్నారు.
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.