నెల్లూరు: మైనారిటీ గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.మంగళవారం క్యాంపు కార్యాలయంలో నెల్లూరు రూరల్ అక్కచెరువుపాడులో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల భవన నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి వచ్చే ఏడాది జూన్ మాసంలో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని సూచించారు. ఈ పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలన్నీ నాడు నేడు పథకం కింద సమకూర్చాలని ఆదేశించారు.
బహుళార్ధ సౌకర్యాల కేంద్రాలు:- వచ్చే అక్టోబర్ 15వ తేదీన సీ.ఎం ప్రారంభించే విధంగా బహుళార్ధ సౌకర్యాల కేంద్రాల నిర్మాణం పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.మంగళవారం క్యాంపు కార్యాలయంలో బహుళార్థ సౌకర్యాల కేంద్రాల నిర్మాణంపై సంబంధిత అధికారులతో నాలుగవ జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించి గోదాముల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన 48 గోదాములకు గాను 10 గోదాములు పూర్తికాగా మరో 10 గోదాములు పూర్తయ్యే దశలో ఉన్నాయన్నారు. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. రెండు చోట్ల స్థలాలను వెంటనే గుర్తించి గోదాముల నిర్మాణం పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే అక్టోబర్ 15 తేదీలోగా కనీసం 30 గోదాముల నిర్మాణం పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా 24 గోదాముల నిర్మాణానికి ఇప్పటివరకు ఖర్చు అయిన మొత్తాలకు సంబంధించి నిధులను విడుదల చేసేందుకు కమిటీ ఆమోదించింది.ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆర్.కూర్మానాధ్ అధికారులు పాల్గొన్నారు.
సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
This website uses cookies.