అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో బయటపడిన కొన్ని డాక్యూమెంట్స్ ను చూస్తుంటే,,క్రేజీవాల్,ఓ క్రిమినల్ లా వ్యవహరించినట్లు తెలుస్తొంది.? కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో 150 పేజీలతో కూడిన ఓ డాక్యుమెంట్ లభ్యమైందని, దాని ప్రకారం ఆయన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులపైనే గూఢచర్యం చేశారని సంబంధిత వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం..ఆ డాక్యుమెంట్లో ఈడీలోని ఇద్దరు ఉన్నత అధికారుల గురించి కీలక సమాచారం ఉందని సంబంధిత దర్యప్తు సంస్థ వర్గాలు తెలిపాయి..ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే,, కేజ్రీవాల్పై గూఢచర్యం కేసు నమోదు కావచ్చు..
ప్రత్యేక డైరెక్టర్-ర్యాంక్ అధికారి, జాయింట్ డైరెక్టర్-ర్యాంక్ అధికారికి సంబంధించిన సున్నితమైన వివరాలు అందులో ఉన్నాయని,, భద్రతా కారణాల దృష్ట్యా వారి పేర్లను బయటపెట్టలేదని తెలియవచ్చింది..ఆ పత్రంలో పేరున్న జాయింట్ డైరెక్టర్-ర్యాంక్ అధికారి,, ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్పై దర్యాప్తుని పర్యవేక్షిస్తున్నారు..ఈ డాక్యుమెంట్ గురించి కేజ్రీవాల్ రిమాండ్ నోట్లో కూడా ప్రస్తావించించారు..
ఈ కేసులో కేజ్రీవాల్ ‘కింగ్పిన్’ అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు లంచం అడిగారని రౌస్ అవెన్యూ కోర్టుకు శుక్రవారం ఈడీ వెల్లడించింది..మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్కు ప్రత్యక్ష పాత్ర ఉందని,,ఈ కేసులో సహ నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే.కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని ఈడీ పేర్కొంది..లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ కలిశారని, కలిసి పని చేద్దామంటూ చెప్పారని ఈడీ కోర్టుకు తెలిపింది.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.