అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ శుక్రవారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4వ తేదిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 7వ తేదిన ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 7వ తేదిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్స్ గడువు 14వ తేది ముగుస్తుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 19 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో నేటి నుంచే ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని విజయ్ దేవ్ పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నదని,మొత్తం 250 వార్డుల్లో 1.26 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హాక్కు వినియోగించుకోనున్నారని,,MCDలో 42 వార్డులు ఎస్సీ రిజర్వ్ డ్ స్థానాలని కమిషనర్ విజయ్ దేవ్ పేర్కొన్నారు.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.