నెల్లూరు: పర్యావరణ హితం కోసం జాతీయ హరిత ట్రిబ్యునల్ ( NGT) సూచించిన మార్గదర్శకాలను నగర వ్యాప్తంగా అమలుచేసి ప్రతిఒక్కరూ పటిష్టంగా పాటించేలా అవగాహన కల్పించాలని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత సూచించారు. భవనాల కూల్చివేతల సందర్భంగా మిగిలే డెబ్రిస్ వ్యర్ధాల తొలగింపుకు నగర పాలక సంస్థ సహకారం తీసుకునేలా నగర వ్యాప్తంగా ప్రచారం కల్పించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ కోరారు. నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులతో ఎన్.జి.టి మార్గదర్శకాలపై సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని సమావేశం మందిరంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ సూచించిన టోల్ ఫ్రీ నెంబర్ కు భవనాల యజమానులు సమాచారం అందిస్తే కార్పొరేషన్ వాహనాల ద్వారా నిర్దేశించిన స్థలాల్లో మాత్రమే డంపింగ్ జరపాలని, ఇతర ప్రాంతాల్లో డంపింగ్ చేస్తే జరిమానాలు విధించాలని కమిషనర్ ఆదేశించారు. చెత్త సేకరణ వాహనాల రాకను సూచించే పాటకు తోడుగా కార్పొరేషన్ సమాచారం అందించే మాటలను కూడా జతపర్చాలని కమిషనర్ సూచించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచించిన మార్గదర్శకాలను అమలుచేసి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని కమిషనర్ ఆకాంక్షించారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.