అమరావతి: తెలుగు సినిమా పరిశ్రమలో తొలి నుంచి మంచు కుటుంబం అంటే ఒక రకమైన అభిప్రాయం నెలకొని వున్నా..ఈనేపధ్యంలో మంచు విష్ణు,,మనోజ్ మధ్య జరిగిన వివాదం రోడ్డుకెక్కింది..అన్న విష్ణుతో వివాదాన్ని మనోజ్ తన సోషల్ మీడియా పేజిలో స్టేటస్గా పెట్టాడు..మనోజ్ ఫేస్బుక్ స్టోరీ పోస్ట్తో ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను,,బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు..తన మనిషి సారథిని కొట్టాడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు..మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు సారథి అనే వ్యక్తి మోహన్ బాబుకు వరసకు సోదరుడు అవుతారు..మొదట్లో సారథి,, విష్ణుకు కుడిభుజంలా ఉంటూ వచ్చారు..కాలక్రమేణా విష్ణు నుంచి దూరం జరిగి,, మోహన్ బాబుకు దగ్గరయ్యారు.. ఈ మధ్య మంచు మనోజ్తో చాలా సన్నిహితంగా ఉంటూ, అతడి వ్యవహారాలు చక్కబెడుతున్నారు..ఈ క్రమంలో సారథి ఇంటికెళ్లి అతన్ని కొట్టబోయాడు మంచు విష్ణు..ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను మనోజ్ విడుదల చేశాడు..విష్ణు తరచూ ఇలా చేస్తున్నాడంటూ మనోజ్ కామెంట్ చేశారు.. మేమేమైనా ఊరికే ఇచ్చామా, తీసుకున్నామా అంటూ ఆ వీడియోలో మాటలు వినిపిస్తున్నాయి..మంచు మనోజ్ ఈ వివాదం జరుగుతున్న సమయంలో డయల్ 100కి కాల్ చేశాడు..దీంతో పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నట్లు సమాచారం..మనోజ్, విష్ణుపై కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయా??
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.