AMARAVATHI

రూ.2వేల కోట్ల డ్రగ్స్‌ మాఫీయా కేసులో DMK నేత,సినీ నిర్మాత AR జాఫర్‌ సాదిక్‌ అరెస్ట్

అమరావతి: అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్ మాఫీయాకు సబంధించి దాదాపు రూ.2వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో తమిళనాడుకు చెందిన DMK NRI విభాగం నాయకుడు,,సినీ నిర్మాత AR జాఫర్‌ సాదిక్‌ ను శనివారం అరెస్ట్‌ చేసినట్లు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వెల్లడించారు..గత నెలలో ఢిల్లీ పోలీసులు,,NCB అధికారులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టి అంతర్జాతీయ డ్రగ్‌ నెట్‌వర్క్‌ ను ఫిబ్రవరి 24న గుర్తించారు..ఈ కేసులో ఇప్పటికే అధికారులు కొందరిని అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించగా వారి వద్ద నుంచి 50 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు..ఈ డ్రగ్స్ రాకెట్ లో జాఫర్‌ సాదిక్‌ కీలక సూత్రధారిగా గుర్తించిన పోలీసులు అతడి కోసం వేల మొదలు పెట్టారు..శనివారం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు.

ఈ డ్రగ్‌ నెట్‌వర్క్ భారతదేశం,,న్యూజిలాండ్,,ఆస్ట్రేలియా,, మలేషియాలకు విస్తరించినట్లు NCB అధికారులు తెలిపారు..హెల్త్ మిక్స్ పౌడర్,, ఎండు కొబ్బరి వంటి ఆహార పదార్థాల ముసుగులో కంటైర్స్ సరకుల ద్వారా డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు..గత 3 సంవత్సరా వ్యవధిలో మొత్తం 45 సరకులు పంపారని,, అందులో సుమారు 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్ రవాణా జరిగినట్లు అధికారులు వెల్లడించారు.. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2వేల కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు..డ్రగ్స్ మాఫీయా నెట్‌వర్క్‌ లో వున్న నిందితులను అరెస్టు చేసేందుకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా అధికారులను సంప్రదించినట్లు NCB అధికారులు తెలిపారు.
జాఫర్‌ను పార్టీ నుంచి తొలగించిన DMK:- జాఫర్‌ సాదిక్‌ తమిళనాడులోని DMK పార్టీలో కీలకమైన వ్యక్తి..భారీ డ్రగ్‌ రాకెట్‌లో ఆయన పాత్ర బయట పడడంతో డీఎంకే సాదిక్‌పై ఇటీవలే చర్యలు తీసుకుంది..పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఎన్‌ఆర్‌ఐ విభాగం నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ ప్రకటించారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

15 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

16 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

20 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.