అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ మద్యం స్కామ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది..ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ,,దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది.(దిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు)లో ఈడీ సోదాలు చేస్తోంది..దిల్లీ మద్యం కుభకోణంలో,,TRS MLC కేసీఆర్ కుమారై కవిత,,YSRCP MPఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిల పైనా ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ గురిపెట్టింది..ఈడీ బృందాలు తెలంగాణ, చెన్నై, నెల్లూరు, దిల్లీలోని మాగుంట నివాసాల్లో ఏకకాలంలో 25 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు.. రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బందిని విచారిస్తున్నారు. కార్యాలయంలోకి ఎవరూ రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు..ఇంతకు ముందు ఈడీ హైదరాబాద్లో సోదాలు చేసింది.. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది..సికింద్రాబాద్ పటేల్ రోడ్డులోని నవకేతన్ భవన్లో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ చిరునామా ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా,, సదరు చిరునామాలో ఓ పేరొందిన బ్యూటీ పార్లర్ ఉన్నట్లు తేలింది.. రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్లో డైరెక్టర్గా ఉన్న అభిషేక్ రావు సదరు బ్యూటీ పార్లర్ సంస్థలకు డైరెక్టర్గా ఉన్నారు.. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ ఈమెయిల్ అడ్రస్ సైతం ఒకటేనని ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది..అలాగే కోకాపేట్లోని రామచంద్ర పిళ్లై నివాసంలోనూ ఈడీ అధికారుల సోదాలు చేశారు..పలువురి రాజకీయ ప్రముఖులతో రామచంద్ర పిళ్లైకి సంబంధాలున్నట్లు అనుమానించిన అధికారులు తగిన ఆధారాలు సేకరించారు..
నెల్లూరు:- నగరంలోని రాయాజీ వీధిలోని ఎం.పీ మాగుంట.శ్రీనివాసులరెడ్డి నివాసంలోను, ఆఫీసుల్లో,,అలాగే బుచ్చిరెడ్డిపాళెం,రేబాలలో నివాసం వుంటున్న మాగుంట బంధువు అయిన ఏటూరు.శివరామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.. ఇంట్లోను తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత:- మద్యం స్కామ్ కేసులో కవిత మెడకు కాస్త గట్టిగానే చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.. గతంలో కవిత పీఏ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది..శుక్రవారం కవిత అకౌంటెంట్ ఇంట్లో సోదాలు నిర్వహించింది..అలాగే కవితకు ఈడీ నోటీసులు పంపించింది..ప్రస్తుతం కరోనా సోకడంతో ఆమె క్వారంటైన్లో ఉండటంతో కవిత సహాయకులకు ఈడీ నోటీసులు అందజేసింది..హైదరాబాద్లో పలువురు వ్యాపార వేత్తలు, చార్టెడ్ అకౌంట్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.