నెల్లూరు: ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారని రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో బుధవారం ముత్తుకూరు మండలం నేలటూరు జెన్కో థర్మల్ పవర్ స్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన సీఎం బహిరంగ సభ, హెలిప్యాడ్, పైలాన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నదాతలకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ను అందిస్తున్నామని, విద్యుత్ రంగంలో తమ ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రాజెక్టుల వల్ల తక్కువ ఖర్చుతో మనకు అవసరమైన విద్యుత్ ను మనమే ఉత్పత్తి చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. నేడు జెన్కో మూడో యూనిట్, ఫిబ్రవరిలో విజయవాడ వద్ద గల నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ లో ఏడో యూనిట్ కూడా సీ.ఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నామని,ఈ రెండు యూనిట్ల ఏర్పాటుతో రాష్ట్రంలో విద్యుత్ కొరత పూర్తిగా తగ్గి, ప్రజలకు నిరంతరాయం విద్యుత్తు అందించే వీలు కలుగుతుందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.