నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలు, గుర్రపు డెక్కాకును యుద్ధప్రాతిపదికన తొలగించి నీటి పారుదలకు అంతరాయం లేకుండా చూడాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా బుధవారం పరమేశ్వరి నగర్, పాత మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యాచరణను ఆయన పరిశీలించారు. స్థానికంగా ఉన్న ఉయ్యాల కాలువ, రామిరెడ్డి కాలువల్లో పేరుకున్న వ్యర్ధాలను గమనించిన కమిషనర్ గ్యాంగ్ వర్క్ ద్వారా కాలువల పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో పెన్నానది తీరంలో నూతనంగా నిర్మిస్తున్న హిందువుల కర్మక్రతువుల భవన పనులను కమిషనర్ పరిశీలించారు. సంప్రదాయ రీతిలో, అత్యంత నాణ్యతతో భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ చంద్రయ్య, శానిటేషన్ విభాగం అధికారులు, సచివాలయం కార్యదర్శులు, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
This website uses cookies.