అమరావతి: బెంగళూరు నగరంలోని కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్లో శుక్రవారం మధ్యహ్నం 2 గంటల సమయంలో పేలుడు సంభవించింది..పేలుడు తీవ్రతకు రామేశ్వరం కేఫ్ దెబ్బతినగా,5కి తీవ్ర గాయాలయ్యాయి.. క్షతగాత్రులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు..పేలుడు సంభవించిన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీయడంతో కొంతసేపు అక్కడ ఆందోళన వాతావరణం నెలకొంది..సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు..గ్యాస్ సిలిండర్ లేదా బాయిలర్ పేలి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.. అయితే ఆ ప్రాంతంలో కొన్ని ఐడీ కార్డులు,,పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో బ్యాటరీని గుర్తించారు..అలాగే, కేఫ్లో ఓ కస్టమర్ బ్యాగ్ కాలిపోయి కనిపించింది.. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..సంఘటన స్థలంకు ఏసీపీ రీనా సువర్ణ, మారతహళ్లి పోలీసులు చేరుకుని కాలిపోయిన బ్యాగును, ఐడీ కార్డును పరిశీలించారు.. కేఫ్ లోని సీసీటీవీ పుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు.. పేలుడు వెనుక ముష్కరుల కుట్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు..అలాగే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.