AMARAVATHICRIME

బెంగళూరు సిటీలోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు-ఐదుగురికి గాయాలు

అమరావతి: బెంగళూరు నగరంలోని కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యహ్నం 2 గంటల సమయంలో పేలుడు సంభవించింది..పేలుడు తీవ్రతకు రామేశ్వరం కేఫ్ దెబ్బతినగా,5కి తీవ్ర గాయాలయ్యాయి.. క్షతగాత్రులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు..పేలుడు సంభవించిన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీయడంతో కొంతసేపు అక్కడ ఆందోళన వాతావరణం నెలకొంది..సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు..గ్యాస్ సిలిండర్ లేదా బాయిలర్ పేలి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.. అయితే ఆ ప్రాంతంలో కొన్ని ఐడీ కార్డులు,,పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో బ్యాటరీని గుర్తించారు..అలాగే, కేఫ్‌లో ఓ కస్టమర్ బ్యాగ్ కాలిపోయి కనిపించింది.. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..సంఘటన స్థలంకు  ఏసీపీ రీనా సువర్ణ, మారతహళ్లి పోలీసులు చేరుకుని కాలిపోయిన బ్యాగును, ఐడీ కార్డును పరిశీలించారు.. కేఫ్ లోని సీసీటీవీ పుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు.. పేలుడు వెనుక ముష్కరుల కుట్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు..అలాగే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు..

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *