అమరావతి: గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆర్దికంగా అండగా నిలిచారు. ఇప్పటం వెళ్లి స్వయంగా బాధితులను పరామర్శించిన పవన్,వారి కష్టలను చూసి చలించిపోయి,వారికి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు.ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు తెలియజేశారు.‘మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం దాష్టీకానికి ఇళ్లు దెబ్బతిన్న వారు, నివాసాలు కోల్పోయిన వారికి రూ.లక్ష వంతున అందించి అండగా నిలబడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. మార్చి14వ తేదిన ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని కక్షగట్టిన వైసీపీ ప్రభుత్వం ఇళ్లను కూల్చిందని పేర్కొన్నారు. పోలీసులను, జె.సి.బి.లను పెట్టి మరీ ఇళ్లు కూల్చివేయడం దారుణమని, ఈ సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు.ఈ సంఘటన జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ ఇప్పటం సందర్శించి బాధితులను పరామర్శించారు’ అని తెలిపారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.