అమరావతి: నూతన తెలుగు సంవత్సరాది నాడు తమిళనాడు ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది..కాంచీపురం జిల్లా కురువిమలైలోని వరాలతోట్ ప్రాంతంలో ‘నరేంద్రన్ ఫైర్ వర్క్స్’ అనే ప్రైవేట్ యాజమాన్యంలోని బాణసంచా తయారీ ప్లాంట్ పనిచేస్తోంది..ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో 5గురు సజీవ దహనం అయ్యారు..మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి.. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు..ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఫైటర్స్,, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు..ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది పని చేస్తున్నట్లు సమాచారం.. ఫ్యాక్టరీ గోడౌన్లో భారీ పేలుడు శబ్దాలు రావడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాధితులను ఆటోల్లో ఆస్పత్రికి తరలించారు..సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..పది మందికి పైగా తీవ్ర గాయాలతో చికిత్స నిమిత్తం కాంచీపురం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరారు..వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి..పేలుడుకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.