AMARAVATHI

బ్రిటన్ కు నొప్పి తెలిసిందా-ఎంబసీ ముందు బారికేడ్లు తొలగింపు

దెబ్బకు దెబ్బ…

అమరావతి: గతంలో లాగా భారత్ కు ఎక్కడ అవమానం జరిగిన తలవంచుకుని వెళ్లె పరిస్థితి లేదని,,దెబ్బకు దెబ్బ అన్న చందన చాలా విషయాల్లో భారత్ తీవ్రంగా స్పందిస్తొంది అనే విషయం ప్రపంచ దేశాలకు బాగా ఆర్దమౌతొంది..ఈ నేపధ్యంలో…ఇటీవల బ్రిటన్ రాజధాని లండన్లోని భారత హైకమిషనరేట్ ముందు ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు తొలగించే ప్రయత్నం చేసిన విషయం విదితమే..త్రివర్ణ పతాకాన్ని తొలగించి ఖలిస్తానీ జెండా ఎగరవేద్దామనుకున్నప్పటికి,రాయబార కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది అడ్డుకోవడంతో, ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది..ఈ చర్యలో ఖలిస్తానీ మద్దతుదారుల అరాచకత్వం కనిపిస్తూనే ఉన్నప్పటికీ,, బ్రిటన్ ప్రభుత్వం నిర్వహణాలోపం కూడా స్పష్టంగానే కన్పిస్తొంది..లండన్లో భారత్కు జరిగిన ఈ అవమానానికి ప్రతిచర్య బలంగానే తెలిసింది..ఢిల్లీ చాణక్యపురి ఎన్‌క్లేవ్‌లోని శాంతిపథ్ వద్ద బ్రిటన్ ఎంబసీ వెలుపల ఉంచిన సిమెంట్ దిమ్మెలను రాజాజీ మార్గ్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ నివాసం వరకు తొలగించారు.. ఆదివారం నాడు లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల జరిగిన హింసాత్మక నిరసనపై ప్రభుత్వ అత్యున్నత స్థాయి అంచనాను అనుసరించి ఈ పరిణామం చోటు చేసుకుంది..ఈ చర్యపై ఇండియాలోని బ్రిటన్ హైకమిషనర్ స్పందిస్తూ తాము భద్రతా విషయాలపై వ్యాఖ్యానించమన్నారు..ఈ విషయమై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. లండన్లోని భారత హైకమిషనరేట్ ముందున్న త్రివర్ణ పతాకాన్ని తొలగించే ప్రయత్నం జరిగిన చాలా సేపటి తరువాత లండన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొలేదు..ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తల నుంచి మరిన్ని నిరసనలు హింసాత్మకంగా మారే అవకాశాలపై బ్రిటన్ అధికారులతో భారత ఇంటెలిజెన్స్ విభాగం చర్చించినట్లు తెలుస్తోంది. ఖలిస్తాన్ అనుకూల వ్యక్తులు హైకమిషన్ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతించడంపై భారత్ వివరణ కోరింది..ప్రతి ఒక్కరిని గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది.

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

4 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

4 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

20 hours ago

తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోంది-జెడీ.లక్ష్మీనారాయణ

అమరావతి: జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని సంచలన…

22 hours ago

జాతీయ సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి

తిరుపతి: సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం సతీ సమేతంగా తిరుపతికి చేరుకున్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ కు…

24 hours ago

This website uses cookies.