అమరావతి: విజయవాడ,గాంధీనగర్ ప్రాంతంలోని జింఖానా గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణాల సముదాయంలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బ్రహ్మ,కాశీ అనే ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.. భారీ అగ్నిప్రమాదంతో గ్రౌండ్లో ఏర్పాటుచేసిన 15 దుకాణాలకు మంటలు వ్యాపించాయి.ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.షాపులకు మంటలు వ్యాపించడంతో, దుకాణంలోని బాంబుల మోతకు ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.కొన్ని దుకాణాలు పూర్తిగా,, మరికొన్ని పాక్షికంగా అగ్నికీ అహుతి అయ్యాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో నిర్వాహకులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్లే జరిగిందని,అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.