NATIONAL

భారత పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ బీబీ లాల్‌ కన్నుమూత

అమరావతి: భారత పురావస్తు శాఖ (ASI) మాజీ డైరెక్టర్‌ జనరల్‌ బీబీ లాల్‌ (101 ) కన్నుమూశారు..ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా  తెలియచేశారు..భారతదేశంలో పురాత‌త్వ ప‌రిశోధ‌న‌ల‌కు బీబీ లాల్ విశేష సేవ‌లు అందించార‌ని,,అలాగే గ‌త నాలుగు ద‌శాబ్ధాలుగా యువ ఆర్కియాల‌జిస్టుల‌కు శిక్షణ ఇచ్చారని కిషన్‌రెడ్డి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు..బీబీ లాల్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ  విచారం వ్యక్తం చేస్తూ, బీబీ లాల్ ది అద్భుతమైన వ్యక్తిత్వమని, పురావస్తు శాస్త్రానికి ఆయన చేసిన కృషి అసమానమైనదని మోడీ ట్వీట్ చేశారు.. బీబీ లాల్‌ను భార‌త ప్రభుత్వం 2021లో ప‌ద్మ విభూష‌ణ్‌తో స‌త్కరించింది..బాబ్రీ మ‌సీదు ఉన్న స్థానంలోనే రామ మందిరం ఉండేద‌ని బీబీ లాల్ త‌న ప‌రిశోధ‌న‌ల్లో ర‌చించారు..సదరు ప‌రిశోధ‌న ర‌చ‌న‌ల ఆధారంగానే సుప్రీంకోర్టు రామ మందిర ఆల‌య నిర్మాణానికి అనుకూల తీర్పునిచ్చింది..ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో 1921లో జన్మించిన లాల్,,1968 నుంచి 1972 మధ్య ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.. 

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

16 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

17 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

21 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.