యూజర్ చార్జీలు..
నెల్లూరు: నగరంలో ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్న నూతన వాహనాల రుణ బకాయీల చెల్లింపులకు యూజర్ చార్జీల వసూళ్లు తప్పనిసరి అని, అన్ని డివిజనుల్లో పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ శ్రీమతి హరిత సచివాలయం అడ్మిన్ కార్యదర్శులను ఆదేశించారు.శుక్రవారం రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయం అడ్మిన్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సమీక్షిస్తూ ప్రభుత్వ సంక్షేమ పధకాలైన అమ్మవడి, కాపు నేస్తం, వాహన మిత్ర నూతన లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయడంలో అలసత్వం సహించబోమని తెలిపారు.ఆస్థి పన్ను వసూళ్లకోసం చలనా మంజూరు అయిన వెంటనే వసూలు చేసిన మొత్తాలను డిపాజిట్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా ఆయా మొత్తాలను ఉంచుకోవద్దని ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా (CLAP) యూజర్ చార్జీల వసూళ్లపై సచివాలయం అడ్మిన్ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని, స్లమ్ ప్రాంతాల్లో రూ.30/-,నాన్ స్లమ్ ప్రాంతాల్లో రూ.90/- లను క్రమం తప్పకుండా వసూళ్లు చేయాలని సూచించారు. కమర్షియల్ ప్రాంతాల్లో భవనం పరిధిని బట్టి యూజర్ ఛార్జ్ విధించాలని, వలంటీర్లకు చార్జీల వసూలు టార్గెట్ విధించడం ద్వారా త్వరితగతిన వసూళ్లు చేయగలమని కమిషనర్ పేర్కొన్నారు. సచివాలయం అడ్మిన్ కార్యదర్శులుగా యూజర్ చార్జీల వసూళ్లు బాధ్యతగా భావించి, శానిటరీ కార్యదర్శులను సమన్వయం చేసుకుని చార్జీల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, సెక్రెటరీ హేమావతి, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్ లు, సిబ్బంది పాల్గొన్నారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.