అమరావతి: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకుడు గులాం నబీ ఆజాద్,జమ్మూలో తాను స్థాపించబోయే కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన వివరాలను వెల్లడిస్తూ,నూతన పార్టీ పేరుకోసం దాదాపు 1500 పేర్లను ఉర్దూ, సంస్కృతంలో పరిశీలన చేసినట్లు తెలిపారు. చివరికి ఉర్దూ, హిందీ కలిపి ‘హిందుస్థానీ’ అన్నారు. ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా, స్వాతంత్ర్యాన్ని ప్రతిబింబించేలా పార్టీ పేరు ఉండాలని కోరుకున్నామని, అందుకే ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ అని పేరు పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికలో మూడు రంగులతో జెండాను రూపొందించారు. కశ్మీర్ ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ ఎజెండా అని ఆజాద్ అన్నారు. ప్రస్తుతం తన పార్టీ జమ్మకశ్మీర్ కే పరిమితం అవుతుందని, భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా విస్తరించే విషయంపై ఆలోచిస్తానని చెప్పారు.తాను స్థాపించిన కొత్త పార్టీలో ‘ఏజ్ బార్’ ఉండదని, యువకులు, అనుభవజ్ఞులు పార్టీలో కలిసి పనిచేస్తారని తెలిపాడు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.