అమరావతి: 2024లో జరిగే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత్-అమెరికా మధ్య బంధాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ హిందూ విభాగంకు చెందిన భారత సంతతి అమెరికన్లతో ఫ్లోరిడాలోని తన రిసార్టులో నిర్వహించిన దీపావళి విందు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో పై విధంగా ట్రంప్ అన్నారు.తాను భారతదేశంలో పర్యాటించిన సమయంలో అక్కడి ప్రజలు తనపై చూపించిన ప్రేమాభిమానలను మర్చిపోలేన్నన్నారు. హిందువులు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. 2024 ఎన్నికల్లో తాను గెలిస్తే RJS వ్యవస్థాపకుడు షలాభ్ కుమార్ ను అమెరికా రాయబారిగా, భారత్ కు నామినేట్ చేస్తానని వెల్లడించారు.రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానా? అన్న విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. ఒకవేళ తాను పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తానని తెలిపారు. ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ అభ్యున్నతి కోసం తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని,, పలు రాష్ట్రాల్లో హిందువుల మద్దతు లేకపోతే తాను 2016 ఎన్నికల్లో విజయం సాధించలేకపోయేవాడినని తెలిపారు.
సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
This website uses cookies.