అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నియామకాలపై హైకోర్టు కీలక అదేశాలు ఇచ్చింది.. అభ్యర్థుల ఎత్తు కొలిచే విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.. గతంలో రిజర్వ్ సబ్ ఇన్స్ పెక్టర్ గా పని చేసిన వ్యక్తిని కూడా ఎత్తు సరిపోలేదంటూ తిరస్కరించారని పిటీషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆఫీడివిట్ దాఖలు చేశారు.. గతంలో అభ్యర్థులందరి ఎత్తు తన సమక్షంలోనే తీసుకుంటామంటూ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పిటీషనర్లందరూ సిద్ధంగా ఉన్నారని న్యాయవాది హైకోర్టుకు వివరించారు..2019లో ఎత్తు విషయంలో క్వాలిఫై అయిన అభ్యర్థులు 2023లో అనర్హత సాధించడంపై గతంలో హైకోర్టులో వాదనలు జరిగాయని,, పూర్తి స్థాయి విచారణ తరువాత ఎస్ఐ ఫలితాలు నిలుపుదల చేయాలి అంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చిందని అడ్వకేట్ తెలిపారు..సదరు ఉత్తర్వులను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ కు రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసింది..అభ్యర్థులు ఎత్తు విషయంలో తామే నిర్ణయం తీసుకుంటామని,,పిటిషనర్లు అందరూ సోమవారం కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.