అమరావతి: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది..చైనాను జనాభాను దాటి భారత్లో ప్రస్తుతం 29 లక్షల మంది ప్రజలు అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు స్పష్టం చేశాయి..స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023 పేరుతో ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ నివేదికను విడుదల చేసింది..నివేదిక ప్రకారం భారత్లో 142.86 కోట్ల మంది జనాభా ఉన్నారని అందులో పొందుపర్చింది..చైనా జనాభా 142.57 కోట్ల మంది ఉండగా,,340 మిలియన్లతో అమెరికా 3వ స్థానంలో ఉందని వెల్లడించింది..ఎప్పుడు చైనా జనాభాను భారత్ ఎప్పుడు అధిగమించిందనే విషయాన్ని స్పష్టం చేయలేదు..2023 ఫిబ్రవరి నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ నివేదికను రూపొందించినట్లు సమాచారం..ప్రపంచ జనాభాలో (804.5 కోట్లు) మూడింటా ఒక వంతు ఈ రెండు దేశాల్లోనే ఉన్నరని పేర్కొన్నది..చైనా జనాభా సంవత్సరం ఉచ్చస్థితికి చేరిందని,, అప్పటి నుంచి తగ్గుతూ వచ్చిందని తెలిపింది..ఇండియా జనాభా మాత్రం క్రమేపి పెరుగుతోందని వెల్లడించింది..భారతదేశ జనాభాలో 0 నుంచి 14 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారు 25 శాతం ఉన్నారని,,10 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు 18 శాతం,,10 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్కులు 26 శాతం ఉన్నారని డేటాలో పేర్కొంది.. భారత్ లో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు 68 శాతం మంది ఉన్నారని,,65 సంవత్సరాలకు పైబడిన వారు దేశ జనాభాలో 7 శాతంగా ఉన్నారని పేర్కొన్నది.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
This website uses cookies.