NATIONAL

చైనా మోహరింపులకు ధీటుగా ప్రళయ్ తో సమాధానం ఇవ్వనున్న భారత్

అమరావతి: భారత్ సరిహద్దులకు సమీపంలో చైనా డ్రోన్లు,యుద్దవిమానలు మోహరిస్తున్న నేపధ్యంలో భారత సైన్యం వ్యూహాత్మక కార్యకలాపాల కోసం తొలిసారిగా LAC వద్ద ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణిని మోహరించాలని సైన్యం నిర్ణయించినట్లు ఎజెన్సీలు వెల్లడించాయి..ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల వరకు తన లక్ష్యాన్ని టార్గెట్ ని చేధింగల ఈ క్షిపణిని 2021 డిసెంబర్‌లో వరుసగా రెండు రోజుల్లో రెండుసార్లు విజయవంతంగా పరీక్షించారు.. అప్పటి నుంచి భారత సైన్యం తన అమ్ములపొదిలో చేర్చుకునేందుకు ఎదురుచూస్తున్నది.. భారత్-చైనా సరిహద్దుల్లో ప్రళయ్‌ క్షిపణిని మోహరించే ప్రక్రియ దాదాపు ప్రారంభమైంది..ఇందులో బాగంగా వచ్చే వారం జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉన్నది.. త్రివిధ దళాలు ప్రస్తుతం రాకెట్ ఫోర్స్‌(మూడు విభాగాలను సమన్వయం చేస్తు దాడుల చేసే)ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి..ఈ రాకెట్‌ ఫోర్స్‌ నిర్మాణంలో దివంగత జనరల్ బిపిన్ రావత్ ఎంతో కృషి చేశారని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్కే హరి కుమార్ వెల్లడించారు.. సరిహద్దులో శత్రువులను ఎదుర్కోవడంలో ఈ రాకెట్‌ ఫోర్స్‌ ప్రత్యేకత కలిగి ఉంటుంది. ప్రళయ్‌ క్షిపణిలో సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటారు అమర్చబడి ఉంటుంది..క్షిపణి మార్గదర్శక వ్యవస్థలో అత్యాధునిక నావిగేషన్,, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ ఉంటాయి.. ప్రళయ్‌ క్షిపణి 1000 కిలోల బరువున్న పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లగలదు..ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ఛేదించగలిగే విధంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు డీఆర్‌డీఓ వర్గాలు పేర్కొన్నాయి..హోలోకాస్ట్‌ వేగాన్ని డీఆర్‌డీఓ ఇంకా వెల్లడించనప్పటికీ,, ఈ క్షిపణి రాత్రి పూట కూడా శత్రువులను లక్ష్యంగా చేసుకుంటుందని సమాచారం.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

8 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

11 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

11 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

13 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.