అమరావతి: చైనా సరిహద్దు ప్రాంతంలో భారత ఆర్మీ తన కార్యకలాపాలను పెంచింది..లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ(LAC) చుట్టూ ప్రాంతాల్లో గుర్రాలు,,గాడిదలతో ఆర్మీ సిబ్బంది సంచరిస్తున్న వీడియోలతో పాటు, పాంగోంగ్ సరస్సుపై భద్రత చర్యల్లో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..గల్వాన్ లోయ ప్రాంతంలో భారత్,, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్ (PC) 14 వద్ద 2020లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తలెత్తింది.. ప్రస్తుతం అదే ప్రాంతంలో భారత ఆర్మీ భద్రత స్థాయిన పెంచింది..ఈ ప్రాంతంలో పటియాలా బ్రిగేడ్ కు చెందిన త్రిశూల్ డివిజన్లో సైనికులు PC-14 కు కేవలం 4 కిలో మీటర్ల దూరంలో సరదాగా క్రికెట్ ఆడుతూ కనిపించారు.. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత ఆర్మీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది..గడ్డకట్టే చలిలో సైతం జవాన్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుకుంటున్నారు..మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం అంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన లేహ్ బేస్ట్ 14 సైనిక బృందం ట్విటర్ లో పోస్టు చేసింది..గల్వాన్ ఘటన తర్వాత భారత్ – చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరిపి పెట్రోలింగ్ పాయింట్ 14కు 1.5 కిలో మీటర్ల దూరం నుంచి బఫర్ జోన్ గా ప్రకటించారు.
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
This website uses cookies.