అమరావతి: ప్రపంచానికి భారతదేశం యుద్ధసందేశం అందించలేదని,,శాంతి సందేశం బుద్ధుడి ద్వారా అదించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు..గురువారం ఢిల్లీలోని తొలి ప్రపంచ బౌద్ధ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్న సందర్బంలో మాట్లాడుతూ నేడు ప్రపంచం యుద్ధం,,అశాంతితో సతమతం అవుతుందన్నారు..ఈలాంటి పరిస్థితిలను దృష్టిలో వుంచుకునే శతాబ్దాల క్రితం బుద్ధుడు వీటికి శాంతి పథం అనే పరిష్కారం చూపించాడన్నారు..గౌతమ బుద్ధుని గొప్ప బోధనలు శతాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేశాయన్నారు..బుద్ధుని మార్గమే భవిష్యత్తు,, స్థిరత్వానికి మార్గమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు..బుద్ధ బోధనల నుంచి ప్రేరణ పొందిన భారతదేశం, ప్రపంచ సంక్షేమం కోసం కొత్త కార్యక్రమాలను చేపట్టనున్నదన్నారు..దేశాలు తమ ప్రయోజనాలతో పాటు ప్రపంచ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మోడీ ఉద్ఘాటించారు..అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (IBC) సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 20 , 21 తేదీల్లో గ్లోబల్ బౌద్ధ సదస్సును నిర్వహిస్తోంది..ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ బౌద్ధ సన్యాసులు,,పండితులు,,ప్రతినిధులు హాజరయ్యారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.