DISTRICTS

సరోగసి కేంద్రాలో తనిఖీలు నిర్వహించాలి-కలెక్టర్ హరినారాయణన్

నెల్లూరు: జిల్లాలో నూతనంగా ఏర్పాటయ్యే ART, సరోగసి కేంద్రాలను సభ్యులందరూ సమిష్టిగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ ఆదేశించారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ అధ్యక్షతన జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ PC,,PNDT,ART, సరోగసి చట్టాలను జిల్లాలో సక్రమంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో లింగ నిష్పత్తి ప్రతి వేయి మంది పురుషులకు 914 మంది స్త్రీలు ఉన్నందున, ఆకస్మిక తనిఖీలు చేసి లింగ నిర్ధారణకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే ART, సరోగసి కేంద్రాలను సభ్యులందరూ సమిష్టిగా తనిఖీలు నిర్వహించి సవివరమైన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు..కమిటీ సభ్యులైన జిల్లా మొదటి అదనపు జడ్జి జి.కబర్థి మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లాలో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న ART క్లినిక్స్, సరోగసి క్లినిక్స్, స్కానింగ్ సెంటర్లు తదితర కేంద్రాలకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ ఆమోదం కొరకు ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి వెంకట ప్రసాద్ అందించారు.ఈ సమావేశంలో సభ్యులు Dr గీతా లక్ష్మి,NGO కవితా రెడ్డి, లీగల్ కన్సల్టెంట్ రూప, DSP శివాజీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

3 hours ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

3 hours ago

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

8 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

1 day ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 day ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

This website uses cookies.