AMARAVATHI

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల తయారీ, వాటర్ క్యాన్లలో నీటి స్టోరేజ్, రవాణా ప్రక్రియల్లో కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ సూచించారు. స్థానిక కొండాయపాలెం గేటు సమీపంలో వాటర్ ప్యాకెట్లు రవాణా చేస్తున్న వాహనాలను డాక్టర్ సోమవారం తనిఖీ చేశారు.

నగరంలోని వివిధ దుకాణాలకు రవాణా చేస్తున్న వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పయిరీ తేదీలను ముద్రించకపోవడాన్ని గమనించి, వాటిని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. వాటర్ ప్యాకెట్ల తయారీ సంస్థ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి జరిమానా విధించారు. వాటర్ ప్యాకెట్లపై తేదీలను ముద్రించకుండా మార్కెట్ లోకి పంపిణీ చేస్తే, ఆయా వ్యాపార సంస్థలపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని డాక్టర్ హెచ్చరించారు.

మంచినీటి ప్లాంట్ల నిర్వహణకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని, ప్రతియేటా క్రమంతప్పకుండా అనుమతులను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ప్లాంట్లలో క్రమం తప్పకుండా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వాటర్ ప్లాంట్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత కల్పించాలని, విధులు నిర్వహించే సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు పొందాలని డాక్టర్ సూచించారు. వాటర్ క్యాన్లపై సంబంధిత సంస్థ స్టిక్కర్ ను తప్పనిసరిగా అంటించాలని డాక్టర్ ఆదేశించారు.

అన్ని వ్యాపార సంస్థలు ట్రేడ్ లైసెన్స్, ఎన్. ఓ.సి సెర్టిఫికెట్ అనుమతులను తప్పనిసరిగా పొందాలని , ప్రాంగణాల్లో మంచినీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజా ఆరోగ్య పరిరక్షణకు నగర పాలక సంస్థ సూచించిన అన్ని నిబంధనలను అన్ని వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించినట్లయితే లైసెన్సులు రద్దు చేస్తామని డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు.

Spread the love
venkat seelam

Recent Posts

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

2 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

17 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

23 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

2 days ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

2 days ago

This website uses cookies.