AMARAVATHI

నవంబరు 28 వరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్

అమరావతి: స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధ్యక్షడు చంద్రబాబుకు 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు జస్టిస్.మల్లిఖర్జునరావు అదేశాలు జారీ చేశారు..చంద్రబాబు అనారోగ్య కారణాలను దృష్టిలో వుంచుకుని  కోర్టు బెయిల్ ఇచ్చింది.. సెప్టెంబర్ 9వ తేది ఉదయం 6 గంటలకు నంద్యాల్లో సిఐడి అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు.. 52 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. చంద్రబాబు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు చంద్రబాబు తరఫున లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు..అయన 3 నెలల క్రితమే ఎడమ కంటికి ఆపరేషన్ జరిగిందని,,కుడి కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు..అలాగే ఒళ్లు నొప్పులు, దద్దుర్లతో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు..బ్లడ్, లివర్, యూరిన్, హెచ్ బీ a1c, ECG, 2D ఎకో పరీక్షలు చేయాల్సి ఉందని,,ఈ పరీక్షలు సర్టిఫైడ్ ఇన్ స్టిట్యూట్ లోనే చేయాల్సి ఉంటుందని పిటిషన్ లో తెలియచేశారు.
బెయిల్ పై షరుతులు విధించిన కోర్టు:-1- రూ.లక్ష చోప్పున పూచీకత్తు,,ఇద్దరు షూరిటీలు (బొండా.ఉమా,, దేవీనేని.ఉమాలు) ఇచ్చారు..2-తనకు నచ్చిన ఆసుపత్రిలో సొంత ఖర్చులతో చికిత్స పొందాలన్న కోర్టు..3-చికిత్స ఆసుపత్రి వివరాలు జైలు సూపరింటెండెంట్ కు సమర్పించాలి..4-ఈ వివరాలు సరెండర్ అయ్యే సమయంలో సీల్డ్ కవర్ లో సమర్పించాలని సూ కోర్టు సూచించింది..5-అదే విధంగా ప్రత్యక్షంగా,,పరోక్షంగా కేసును ప్రభావితం చేయరాదని,, నవంబరు 28వ తేది సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండ్ వద్ద సరెండర్ కావాలని అదేశించింది.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

3 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

3 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

5 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

5 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

23 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.