DISTRICTS

విద్యార్దులు ఇంటర్న్షిప్ విధానాన్ని అందిపుచ్చుకొవాలి-కలెక్టర్

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా సాధారణ డిగ్రీ కోర్సులలో ప్రవేశపెట్టిన ఇంటర్న్షిప్ విధానాన్ని అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి పునాది వేసుకోవాల్సిందిగా విద్యార్థినీ విద్యార్థులకు కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు. సోమవారం నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో LIC సంస్థలో ఇంటర్నషిప్ చేయబోవు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ, ఏ రాష్ట్రంలో లేనివిధంగా, కేవలం ప్రొఫెషనల్ కోర్సులలో మాత్రమే ఉండే ఇంటర్న్షిప్ విధానాన్ని సాధారణ డిగ్రీ కోర్సుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. పరిశ్రమల భవిష్యత్తు అవసరాలను ముందుగానే గుర్తించి విద్యార్థులకు ఆయా రంగాలలో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థినీ విద్యార్థులు సానుకూల దృక్పథం కలిగి ఉండి, ఇంటర్న్షిప్ ను కేవలం కోర్సులో భాగంగా కాకుండా, జీవితంలో ఉపయోగపడేవిధంగా నేర్చుకోవడానికి కృషి చేయాలన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో తమదైన మార్కెటింగ్ వ్యూహలతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన సంస్థ భారత జీవిత భీమా సంస్థయని అటువంటి సంస్థ లో దాదాపు 800 మందికి పైగా విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పించిన భారత జీవిత భీమా సంస్థ వారికి, సహాయ సహకారం అందించిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వారికి తమ ప్రత్యేక ధన్యవాదాలన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

21 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

22 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

23 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

23 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

2 days ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

2 days ago

This website uses cookies.