అమరావతి: కొత్తగా తయారు అయ్యే కార్లలో 6 ఎయిర్బ్యాగులు ఉండాలన్న నిబంధన వచ్చే సంవత్సరం అక్టోబర్ 1, 2023 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కంపెనీలు తప్పనిసరిగా ఈ నిబంధన పాటించాలని ఆయన ట్వీట్టర్ లో పోస్టు చేశారు. అక్టోబర్ నుంచే ఈ రూల్ను అమలు చేయాలని కేంద్రం అనుకున్నప్పటికీ ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసినట్లు గడ్కరీ తెలిపారు. ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా దీనిని అమలుచేయాలన్న గడ్కరీ.. మోటారు వాహనాల్లో ప్రయాణించే వారి భద్రతే తమకు ప్రాధాన్యమని తెలిపారు.అక్టోబర్ 1,2022 నుంచి అన్ని కార్లలో ఆరు ఎయిర్బ్యాగులు ఏర్పాటు చేయాలని ఈ ఏడాది జనవరిలో కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.