అమరావతి: మహిళలందరికీ అబార్షన్ను ఎంచుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఒక మహిళ యొక్క వైవాహిక స్థితి,అవాంఛిత గర్భాన్ని తొలగించే హక్కును తొలగించడం సాధ్యం కాదని సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (the Medical Termination of Pregnancy Act,1971) నిబంధలన ప్రకారం,,ఒంటరి, అవివాహిత స్త్రీలకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలో బెంచ్ తీర్పునిచ్చింది.24 వారాల వరకూ MTP చట్టం ప్రకారం అబార్షన్కు అనుమతి ఉందని,,వైవాహిక అత్యాచారానికి గురైన మహిళ కూడా అబార్షన్ హక్కును కలిగి ఉంటుందని తెలిపింది.ఈ సందర్భంగా ‘వైవాహిక అత్యాచారాన్ని’ కూడా కోర్టు ప్రస్తావించింది. వివాహితతో భర్త బలవంతంగా శృంగారం చేస్తే, గర్భం వచ్చినా దాన్ని మారిటల్ రేప్గా పరిగణించి, అబార్షన్ చేయించుకోవచ్చునని చెప్పింది. బలవంతపు గర్భధారణ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
This website uses cookies.