AMARAVATHI

జగనన్నా కాలనీలు పక్క స్కామ్-త్వరలో రిటర్న్ గిప్ట్ ఇస్తా-ఉండవల్లి.శ్రీదేవి

హైదరాబాద్: గత మూడు రోజుల నుంచి  వైసీపీ గూండాలు తనని వేధిస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు..క్రాస్ ఓటింగ్ ఆరోపణల అనంతరం ఆదివారం ఆమె హైదరాబాద్‌లో తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన సందర్బంలో శ్రీదేవి మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డితో తనకు ప్రాణహామీ ఉందని వాపోయారు..సజ్జలపై నేషనల్ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్నారు..నాలుగేళ్ళ పాటు తనను వాడుకుని పిచ్చికుక్క మాదిరిగా ముద్రవేసి బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు..సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని,,డబ్బులు ఇచ్చి తన ఆఫీసుపై దాడి చేయించారని తెలిపారు..తాను గెలిచినప్పటి నుంచి తనపై కుట్ర జరుగుతుందని,,ఎందుకంటే వైసీపీ దందాలకు అడ్డొస్తున్నానని తనని టార్గెట్ చేశారని వాపోయారు..అమరావతిలో 10 శాతమైనా అభివృద్ది చేశారా అని ప్రశ్నించారు..జగనన్నా కాలనీలు పక్క స్కామ్ అని శ్రీదేవి ఆరోపించారు..తాను టీడీపీకి ఓటు వేశానో లేదో వారికెలా తెలుసునని ప్రశ్నించారు.. వైఎస్సాఆర్ తనయుడు పార్టీ అంటే విలువలు ఉంటాయని అనుకుని వైసీపీలో చేరానని,,అయితే జగన్ అలాంటి వ్యక్తి కాదన్నారు..ఈ విషయం తనకు ముందే తెలిస్తే అసలు చేరేదాన్ని కాదని తెలిపారు..ప్రాణం ఉన్నంత వరకు అమరావతి రైతుల కోసం పోరాడుతానని చెప్పారు..తాను ఇక నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని, తనకు ఏ పార్టీకి ట్యాగ్ లేదన్నారు..మహిళా ఎమ్మెల్యేకు రక్షణలేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయని,, జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానాని చెప్పారు..NHRC హామీ ఇస్తే ఏపీలో అడుగుపెడతానని తెలిపారు..  జగన్ చేసిన పనికి మైండ్ బ్లాక్ అయిందని,, త్వరలో రిటర్న్ గిప్ట్ ఇస్తానని శ్రీదేవి వెల్లడించారు. 

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

3 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

4 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

1 day ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

1 day ago

This website uses cookies.