హైదరాబాద్: పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ, నాసా సైంటిస్ట్ కావ్య మన్యపులను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.వారిని చిరంజీవి తన ఇంటికి పిలిపించుకుని వారిద్దరినీ సన్మానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్వీట్ లో పోస్టు చేశారు. వారు చేసిన ఘనతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అమ్మాయిలో ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుందని, ఇద్దరు డైనమిక్ యువతులు కావ్య మన్యపు, పూర్ణా మాలావత్ లు నిరూపించారని ప్రశంసించారు.విద్య, చైతన్యం, సాధికారిత దిశగా అణగారిన వర్గాల బాలికలను నడిపించేందుకు ‘ప్రాజెక్టు శక్తి’ చేపట్టారని, వారు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు వెల్లడించారు.ఎవరూ ఎక్కలేని, లడక్ లోని 6 వేల అడుగులకు పైగా ఎత్తున్న పర్వతాన్ని మాలావత్ పూర్ణ, నాసా సైంటిస్ట్ కావ్య మన్యపులు అధిరోహించారు.100 మంది పేద బాలికలను విద్యతో పాటు వివిధ రంగాల్లో ప్రోత్సహించడం కోసం ‘ప్రాజెక్ట్ శక్తి’ పేరుతో పర్వతారోహణ వీరు మొదలుపెట్టారు.రూ.80 లక్షల దాకా నిధుల సేకరణే లక్ష్యంగా ఈ సాహసయాత్ర చేశారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.