AMARAVATHI

జనసేనను చూస్తూనే,వైసీపీలో వణుకు మొదలైంది-పవన్ కళ్యాణ్

అమరావతి: విజయవాడ పశ్చిమ, జగ్గయ్యపేటలలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైకాపా వర్గాలు అడ్డుకున్న తీరు వారిలోని ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తోందని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్​ను జనసేన జెండా ఆవిష్కరణ చేయకుండా వైకాపా నేతలు, పోలీసులు అడ్డుపడిన వైనం, రిమాండ్ చేయడానికి చేసిన ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. జగ్గయ్యపేటలో జనసేన పతాక ఆవిష్కరణ కోసం పార్టీ శ్రేణులు నిర్మించుకున్న జెండా దిమ్మెను.. అర్ధరాత్రి వైకాపా దౌర్జన్యకారులు జెసీబీతో కూల్చివేశారన్నారు. ఈ ఘటనలో దోషులపై కేసు నమోదు చేయడానికి బదులు ప్రశ్నించిన జనసేన నాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయబద్ధమో పోలీస్ అధికారులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు..పార్టీ శ్రేణులు తలపెడుతున్న ప్రతి కార్యక్రమానికి.. అనుమతి లేదనే సాకుతో పోలీసులు అడ్డుపడడం.. అధికార పార్టీకి వత్తాసు పలకడంగానే భావిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. అధికార పార్టీ అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తున్నారా అని ప్రశ్నించారు. వాడవాడల్లో పెట్టిన విగ్రహాలకు, జెండా దిమ్మెలు, వారు వేస్తున్న రంగులకు ముందుగా మున్సిపల్, పంచాయతీల అనుమతి తీసుకుంటున్నారా అని నిలదీశారు. జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరి తరం కాదని, ప్రజలే పార్టీని కాపాడుకుంటారని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకూడదనే సదుద్దేశ్యంతోనే ఇంత జరుగుతున్నా తాను రోడ్ మీదకు రాలేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తను రోడ్డెక్కడం తప్పదదని హెచ్చరించారు. పోలీసులు సర్వీస్ కాలమంతా డ్యూటీలోనే గడుపుతారని గుర్తుంచుకొవాలన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

37 seconds ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

18 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

19 hours ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

21 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

21 hours ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

22 hours ago

This website uses cookies.