అమరావతి: ఇటీవల కాలంలో యువతి,యువకులు మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు..మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరిస్తూ,,వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైనా హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది..కేవలం హిందువులు చేసుకున్న వివాహాలకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని పేర్కొంది..2017లో ఓ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై న్యాయమూర్తులు కేఎం జోసఫ్, బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది..ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ హైకోర్టులో కేసు దాఖలు చేశారు..హిందువైన తాను క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తిని 2008లో, హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకున్నానని,,ప్రస్తుతం అతను మరో వివాహం చేసుకున్నారని,,హిందూ వివాహ చట్టం 494 సెక్షన్ కింద అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు..అయితే దీనిపై సదరు వ్యక్తి స్పందిస్తూ తాను క్రైస్తవుడినని,,హిందూ వివాహ చట్టం తనకు వర్తించదని పేర్కొన్నారు.. అలాగే ఆమెను తాను వివాహం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు చూపనందుకు కేసును కొట్టి వేయాలని కోరారు..ఇందుకు హైకోర్టు నిరాకరించడంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు..ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు,,వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైనా హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.