DISTRICTS

రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటున్న MLC అభ్యర్ది-మోహన్ రావు

నెల్లూరు: MLC ఎన్నికల ఓట్ల నమోదులో జరిగిన అక్రమాలపై , ఓట్లవెరిఫికేషన్ సందర్భంగా జరుగుతున్న లోపాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఎన్నికల కమిటీ కన్వీనర్ ఎం.మోహన్ రావు తెలిపారు.ఎమ్మెల్సీఎన్నికల ఓట్ల నమోదులో బోగస్ సర్టిఫికెట్లుతో నమోదు జరిగి ఉన్నదని, టీచర్ ఓట్ల నమోదులో అధికార పార్టీ అండతో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘించి నమోదు చేశారన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్టార్ నిబంధనలకు విరుద్ధంగా కౌంటర్ సైన్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని,వీటిపై విచారణ జరపాలని వినతి పత్రంలో పేర్కొవడం జరిగిందన్నారు.అధికార పార్టీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి.చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థను,జిల్లా కలెక్టర్ ని ఎన్నికల ప్రచార వీడియోలలో వాడుకుంటున్నారని, ఈ అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు.ఓట్ల నమోదు వెరిఫికేషన్ సందర్భంగా B.L.Oలు చేయవలసిన పనులకు వాలంటీర్లను, అధికార పార్టీ ప్రజాప్రతినిధులను వినియోగించి వెరిఫికేషన్ లో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని, దానిని నివారించాలని కోరాడం జరిగిందని తెలిపారు.కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ వినతి పత్రాలను పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ,ఉద్యోగ సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్.నగేష్ ,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి.దయాకర్, ఎన్.స్వరాజ్ బాబు ఈ ప్రతినిధి వర్గంలో ఉన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

13 mins ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

5 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

1 day ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

1 day ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 day ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

This website uses cookies.