ఏర్పాట్లపై సమీక్ష..
తిరుపతి: ఈ నెల 25,26వ తేదిల్లో కార్మిక శాఖ జాతీయ సదస్సు తిరుపతిలో నిర్వహించనున్నారని ఏర్పాట్లపై కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సునిల్ బర్త్వాల్, CPFO,, EPFO కమిషనర్ నీలం షామీ రావుతో కలిసి రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ , రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ కార్తికేయ మిశ్రా, తిరుపతి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి,TTD EO ధర్మా రెడ్డి, J.C బాలాజీతో వర్చువల్ విధానంలో జాతీయ సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు..మంగళవారం కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సునిల్ బర్త్వాల్ మాట్లాడుతూ జాతీయ సదస్సు నిర్వహణ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరిగేలా పర్యవేక్షణ వుండాలని తెలిపారు..లైజన్ అధికారుల నియామకం, వివిధ కమిటీల ఏర్పాటు, సమన్వయం తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు..దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కార్మిక శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు దాదాపు 100 మందికి పైగా రానున్నారని,, రెండు రోజుల పాటు స్థానిక తాజ్ హోటల్ లో జరిగే జాతీయ సదస్సు విజయవంతం చేయాలని కోరారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని, వివిధ పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు..
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.