జైళ్లల్లో నుంచే దాందా..
అమరావతి: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బలవంతపూ వసుళ్లూ,,నేరాలు పెరిగిపొతున్న నేపథ్యంలో జాతీయ పరిశోధనా సంస్థ(NIA) దేశంలోని 60ప్రాంతాల్లో సోమవారం NIA అధికారులు పలు గ్యాంగ్ స్టార్స్,, మాఫీయా సిండికేట్ల స్థావరాలపై ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్,,హర్యానా,,ఉత్తరప్రదేశ్,, పంజాబ్ రాష్ట్రాల్లో NIA అధికారులు దాడులు జరిపారు..ఢిల్లీలో నేరాలు సాగిస్తు పేట్రేగిపోతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బంబిహా,, నీరజ్ బవానా గ్యాంగులకు చెందిన 10 మంది గ్యాంగ్ స్టర్లపై ఇటీవల కాలంలో ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఉపా (Unlawful Activities (Prevention) Act (UAPA), కింద కేసులు నమోదు చేశాక NIA దర్యాప్తు ఆరంభించింది..సిద్ధూ మూసే వాలా హత్య కేసులో గ్యాంగస్టర్లకు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ పేర్కొన్నారు.. నీరజ్ షేరావత్ అలియాస్ నీరజ్ బవానా గ్యాంగ్ ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుందని,, నీరజ్ బవానా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుల మధ్య అధిపత్య పోరు సాగుతుందని దర్యాప్తులో తేలినట్లు NIA అధికారులు పేర్కొన్నారు..అలాగే దేశంలో గ్యాంగ్ స్టార్స్,, జైళ్లలో నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని NIA అధికారుల దాడుల్లో కనుగొన్నారు.. భారతదేశంతోపాటు కెనడా, పాకిస్థాన్, దుబాయ్ దేశాల్లోని జైళ్లలో ఉన్న గ్యాంగ్ స్టార్స్,, లారెన్స్ బిష్ణోయ్, గోల్డియా బ్రార్, విక్రం బ్రార్, జగ్గు భగవాన్ పురియా, సందీప్, సచిన్ తాపన్, అనమోల్ బిష్ణోయ్ లు వారి గ్యాంగుల కార్యకలాపాలను లోపల నుంచి సాగిస్తున్నారని NIA అధికారుల సోదాల్లో తేలింది..తీహార్, హర్యానా జైళ్లలో ఉన్న కౌషల్ చౌదరి, లక్కీ పాటియాల్, లారెన్స్ బిష్ణోయ్, బాంబిహా గ్యాంగ్ లపై కూడా (Unlawful Activities (Prevention) Act (UAPA) కింద కేసులు పెట్టాలని NIA నిర్ణయించినట్లు సమాచారం..
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.