DISTRICTS

విద్యా బుద్ధులు నేర్పే గురువుకి ఏ ఒక్కరూ సాటిరారు-కలెక్టర్

నెల్లూరు: విద్యా బుద్ధులు నేర్పే గురువుకి ఏ ఒక్కరూ సాటిరారని, విద్యార్ధులకు ఉత్తమ విద్యను అందించి ఉత్తమ పౌరులుగా  ఉన్నత స్థానానికి చేరుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పేర్కొన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక శ్రీ  వేంకటేశ్వర కస్తూరిభా కళాక్షేత్రంలో జరిగిన ఉత్తమ ఉపాద్యాయ పురస్కార ప్రదానోత్సవం-2022 కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారతీయ సమాజంలో గురువులకు ఒక ప్రత్యేక స్థానం ఉందని,  ప్రతి విద్యార్ధికి విద్యతో పాటు దేశభక్తిని పెంపొందిస్తూ, మంచి ప్రవృత్తని  ఇవ్వవలసిన బాధ్యత గురువులపై ఉందన్నారు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆజాదీ  సే అంతోదయ తక్ కార్యక్రమం కింద జిల్లాకు జాతీయ అవార్డు రావడం జిల్లాకు గర్వకారణమని,  అన్నీ శాఖల  సమిష్టి కృషి ఫలితమే అది సాద్యమైందని కలెక్టర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రమాణాలతో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెండో విడత నాడు – నేడు కార్యక్రమం కింద 460 కోట్ల రూపాయలతో 1400 స్కూల్స్ లో మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

2 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

2 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

4 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

4 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

22 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.