AMARAVATHI

17న కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ జిల్లాకు రాక- కలెక్టర్ హరినారాయణన్

తాత్కాలికంగా VRC కళాశాలలో ఏర్పాటు..

నెల్లూరు: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం కనుపూరు బిట్-2 గ్రామంలో  ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ విద్యా కేంద్రం భవన నిర్మాణానికి స్థలాన్ని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సోమవారం పరిశీలించారు.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ విద్యా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిందన్నారు..ఈ నేపథ్యంలో భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని కనుపూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ పరిశీలించి, రైతులతో మాట్లాడారు..భవన నిర్మాణాలకు స్థలం అవసరమని, రైతుల భూములకు ప్రభుత్వం నుంచి మంచి ధర ఇప్పిస్తామని, రైతులందరూ విద్యా కేంద్రం ఏర్పాటుకు భూములిచ్చి సహకరించాలని కలెక్టర్ కోరారు. అనంతరం నెల్లూరు నగరంలోని VRC కళాశాలలో ప్రాంతీయ విద్యా కేంద్రం తాత్కాలికంగా ఏర్పాటుకు  భవనాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రాంతీయ విద్యా కేంద్రం ఏర్పాటుకు అన్ని వసతులతో తాత్కాలిక గదులను కేటాయించాలని VRC కళాశాల ప్రిన్సిపాల్ కు సూచించారు.

రాష్ట్రస్థాయి సదస్సు:- నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ (జాతీయస్థాయిలో పాఠ్యాంశాల కూర్పు) పై నెల్లూరు శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొంటారని, ఈ సదస్సుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, ఏపీసీలు, ఆర్జేడీలు, డైట్ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ సదస్సు అనంతరం VRC కళాశాలలో ప్రాంతీయ విద్యా కేంద్రం ఏర్పాటుకు తాత్కాలిక భవనాలను సంజయ్ కుమార్ పరిశీలిస్తారన్నారు..కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, డిఇఓ గంగా భవాని, తహశీల్దారు నరేష్ ఉన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

19 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

21 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

1 day ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

1 day ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.