DISTRICTS

మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల పథకం-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో  కలెక్టర్ ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల అమలు జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి వికాస్ పథకంలో భాగంగా చేతివృత్తులతో జీవనోపాధితో  పొందుతున్న వారికి చేయూత నివ్వాలన్నారు.ముఖ్యంగా ఉదయగిరిలోని చెక్కనగిషి కేంద్రం ద్వారా 300 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్న దృష్ట్యా ఆ భవన మరమ్మతులు, యంత్రాల సరఫరా కోసం అవసరమైన నిధులను సమకూర్చుడం కోసం త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. అక్కచెరువుపాడులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 480 సీట్లకు గాను 300 మంది విద్యార్థులు ఉన్నారని , ఆ పాఠశాలలో పూర్తిస్థాయిలో సీట్లను భర్తీ చేసి విద్యా వ్యాప్తికి తోడ్పడాలన్నారు.ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం క్రింద గురుకులాలు, పరిపాలనా భవనాలు, ఐటిఐ భవనాలు, వసతి గృహాల భవనాలు నిర్మాణం వంటి వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన 47 కోట్ల రూపాయలకు మరలా టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలన్నారు..ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీమతి కనకదుర్గ భవాని, మైనార్టీ కార్పొరేషన్ ED నారాయణ,  ZP CEO శ్రీమతి వాణి,DEO రమేష్,,DRDA,డ్వామా, హౌసింగ్ PDలు సాంబశివరెడ్డి,తిరుపతయ్య, నరసింహం,డి MNHO ఓ డాక్టర్ పెంచలయ్య తదితరలు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

17 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

19 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

22 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

23 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

1 day ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.