DISTRICTS

పర్యావరణ సమతుల్యత కాపాడండి-మేయర్, కమిషనర్

నెల్లూరు: వాయుకాలుష్యానికి కారణమయ్యే కర్బన ఉద్గారాల వినియోగంపై ప్రజలంతా చైతన్యం పెంచుకుని పర్యావరణ సమతుల్యతను కాపాడాలని నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ స్రవంతి, కమిషనర్ హరితలు పిలుపునిచ్చారు. బుధవారం భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు ( Environment,Forest & Climate Change) మంత్రిత్వ శాఖ జాతీయ,,రాష్ట్ర,,పట్టణ స్థాయిలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన నిర్విహించే  International Day Of “Clean Air For Blue Skies” (నిర్మల ఆకాశము కొరకు స్వచ్ఛ వాయువులు)లో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక V.R.C కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో స్వచ్ఛమైన వాయు పరిస్థితులను పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ వ్యర్ధాలను, పోగుపడిన చెత్తను తగలబెట్టడం మానుకోవాలని, అనవసరంగ ఏ.సి వాడకాన్ని తగ్గించాలని సూచించారు.ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలని,, పర్యావరణ పరిరక్షణపై పౌరులంతా బాధ్యతతో భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఈ ర్యాలీలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు నీలి రాఘవ రావు, బూడిద సుప్రజ, కో ఆప్షన్ సభ్యులు మొబీనా, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ రాజశేఖర్, ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ సంజయ్, ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయం కార్యదర్శులు, నగర పాలక సంస్థ ఇండోర్, ఔట్ డోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

6 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

11 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

1 day ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

1 day ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

1 day ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

2 days ago

This website uses cookies.