నెల్లూరు: రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు సంబంధించి నిర్మిస్తున్న పునరావాస కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలను, గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీమతి శోబిక, రామాయపట్నం పోర్టు ఎం.డి ప్రతాప్ రెడ్డిలతో కలసి రామాయపట్నం పోర్టు పరిధిలోని నిర్వాసిత గ్రామాలైన మొండివారిపాలెం, రావులవారిపాలెం గ్రామాలకు సంబంధించి నిర్మిస్తున్న ఆర్. అండ్ ఆర్ కాలనీని సందర్శించి, ఆర్ అండ్ ఆర్ కాలనీలో చేపడుతున్న పునరావాస పనులను పరిశీలించారు. చేపడుతున్న పునరావాస పనుల వివరాలు, ప్యాకేజీ పురోగతి, భూ సేకరణ ప్రక్రియ పురోగతి తదితర అంశాలకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, విద్యుత్, త్రాగునీటి వసతి, విద్య, వైద్యం తదితర వసతులతో ఆర్. అండ్ ఆర్ కాలనీలో చేపడుతున్న పునరావాస పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.అనంతరం పోర్టు నిర్మాణ పనులను పరిశీలించి, పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పోర్టు అధికారులకు సూచించారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.