DISTRICTS

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో అక్రమాలను అరికట్టాలి-మోహన్ రావు

నెల్లూరు: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ లిస్టులో అనేక అక్రమాలు జరిగాయని,వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ మంగళవారం సిపిఐఎం జిల్లా కమిటీసభ్యులతో కలసి ఆధ్వర్యంలో డిఆర్ఓకి వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఎన్నికల కమిటీ కన్వీనర్ మోహన్ రావు తెలిపారు.టీచర్ ఎమ్మెల్సీ అధికార పార్టీ అభ్యర్థి నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ విద్యాలయాలలోని ప్రైవేట్ బోధనా సిబ్బందిని అనర్హులైన వారిని ఓటర్లగా నమోదు చేయించడం జరిగిందని, వీటిని వెరిఫై చేయించేందుకు జిల్లా స్థాయి ఐఏఎస్ అధికారిని నియమించి వెరిఫికేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో బోగస్ సర్టిఫికెట్లతో నమోదు చేయించారని, ఈ బిఎల్వోలు సక్రమమైన వెరిఫికేషన్ లేకుండానే ఓటర్ లిస్టులో చేర్చారని వీటి పై విచారణ చేపట్టాలని కోరారు. అప్లై చేసిన ప్రతి ఓటరు అప్లికేషన్, ఇతర సర్టిఫికెట్లను  వెబ్సైట్లో పెట్టాలని ,అప్పుడే వెరిఫికేషన్ సాధ్యమవుతుందని తెలియజేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 2000 ఓట్ల నుంచి నాలుగు వేల ఓట్లు ఉన్నాయని ,ప్రతి 1000 ఓట్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగం మరియు ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళనచేపడుతామని తెలియజేశారు .

Spread the love
venkat seelam

Recent Posts

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

4 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

23 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

24 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 day ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

This website uses cookies.