AMARAVATHI

దేశ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ-బీజెపీ అధ్యక్షుడు బండి.సంజయ్

హైదరాబాద్: నమ్మిన సిద్ధాంతాల కోసం, దేశ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు.జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని బుధవారం బండి సంజయ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ నిజమైన వారసుడు ప్రధాని నరేంద్రమోదీ అని, 370 ఆర్టికల్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి నిర్ణయాలు అందులో భాగమేనని గుర్తు చేశారు.అతి చిన్న వయసులోనే కలకత్తా వర్శిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు. ఎంతో మంది భావి భారత పౌరులను తీర్చిదిద్దారన్నారు..కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న మైనారిటీ సంతుష్టీకరణ విధానాలను చూసి తట్టుకోలేక బయటకు వచ్చి పోరాడారని,,జనసంఘ్ పార్టీని స్థాపించి కొత్త రాజకీయ ఉద్యమానికి తెరలేపిన వ్యక్తి ముఖర్జీ,, పశ్చిమబెంగాల్ ను పాకిస్తాన్ లో కలపాలనే కుట్రను వ్యతిరేకించి పోరాడిన నాయకుడన్నారు.. ఏక్ దేశ్ మే దో నిషాన్.. దో విధాన్… దో ప్రధాన్.. నహీచలేంగా అంటూ 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన వ్యక్తి అన్నారు..ప్రాణాలు పోతాయని తెలిసి కూడా దేశం కోసం వెనుకాడకుండా పోరాడిన మహనీయుడని,, ఇతర దేశాల్లో వలస ఉన్న భారతీయులను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన భావించిన గొప్ప వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ పేర్కొన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

8 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

11 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

11 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

13 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.