నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా పర్యవేక్షించి అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత పేర్కొన్నారు. స్థానిక 20వ డివిజను వనంతోపు ప్రాంతంలోని వికలాంగుల భవన్ ప్రాంగణం, 22వ డివిజను బి.వి నగర్ లోని గిరిజన భవన్ ప్రాంగణం, 29వ డివిజను గాంధీ నగర్ లోని మహిళా ప్రాంగణంలో నిర్మిస్తున్నఆరోగ్య కేంద్రాలను కమిషనర్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతతో సూచించిన గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక గొలగముడి రోడ్డు ఇస్కాన్ టెంపుల్ మార్గంలోని మిట్ట కాలువపై జరుగుతున్న సిమెంట్ కల్వర్ట్ పనులను కమిషనర్ తనిఖీ చేసారు. కల్వర్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి రోడ్డు మార్గం ద్వారా రవాణా సాఫీగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.